అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో 5జీ స్మార్ట్ ఫోన్..రేప‌టి నుంచే సేల్!!

20 Feb, 2022 19:26 IST|Sakshi

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌. ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్ మీ 9 ప్రో ప్ల‌స్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్ర‌వ‌రి 21 నుంచి ఆన్‌లైన్ సేల్కి సిద్ధ‌మైంది. ఫిబ్రవరి21 మధ్యాహ్నం 12:00 గంటల నుండి  రియ‌ల్ మీ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న‌ట్లు రియ‌ల్ మీ ప్ర‌తినిధులు తెలిపారు. 

రేపు విడుద‌ల కానున్న రియ‌ల్ మీ 9 ప్రో ప్ల‌స్ 5జీ ఫోన్  6ప్ల‌స్ 128జీబీ ధ‌ర రూ.24,999, 8ప్ల‌స్ 128 జీబీ ధ‌ర రూ.26,999, 8ప్ల‌స్ 256జీబీ ధ‌ర రూ.28,999గా ఉండ‌నున్నాయి. కొనుగోలు దారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై  ఫ్లాట్ రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చ‌ని రియ‌ల్ మీ ఓ ప్ర‌క‌ట‌నలో వెల్ల‌డించింది.  

రియ‌ల్ మీ 9 ప్రో ప్ల‌స్ 5జీ ఫోన్ ఫీచ‌ర్లు 

రియ‌ల్ మీ 9 ప్రో ప్ల‌స్ 5జీ  ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రియ‌ల్ మీ యూఐ 3.0తో అందిస్తుంది. ఇందులో  సోనీ ఐఎంఎక్స్‌766 సెన్సార్‌, మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెస‌ర్‌, ఫోన్ 60డ‌బ్ల్యూ ఛార్జర్‌, 4,500ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది.  రియ‌ల్ మీ 9 ప్రో ప్ల‌స్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్‌, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి. ఇందులో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

మరిన్ని వార్తలు