రెడ్‌మీ మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్

13 Jan, 2021 11:33 IST|Sakshi

షియోమీ గత ఏడాది రెడ్‌మీ 9 ప్రైమ్‌ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. 9 ప్రైమ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 11తో పనిచేస్తుంది. ఇప్పుడు 9 ప్రైమ్ యూజర్లకు ఎంఐయుఐ12 అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వినియోగదారులు కూడా ఈ విషయాన్ని ట్వీటర్‌లో తెలిపారు. దీనికి సంబందించిన స్క్రీన్ షాట్లను తమ ట్విటర్ లో యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ అప్‌డేట్‌ లో ల్యాండ్ స్కేప్ మోడ్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. ఎంఐయుఐ 12.0.1.0.QJCINXM వెర్షన్ నంబర్‌తో ఈ అప్‌డేట్ రానుంది.

ఈ అప్‌డేట్ సైజు కూడా 600ఎంబీ వరకు ఉంది. ఈ అప్‌డేట్ మొదట్లో చైనాలోని రెడ్‌మీ 9 వంటి ఫోన్‌లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలోని రెడ్‌మి 9 ప్రైమ్‌కు తీసుకురానునట్లు ప్రకటించింది. ఇది దశల వారీగా యూజర్ ఫోన్లకు రానుంది. రెడ్‌మి 9 ప్రైమ్ భారతదేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఎంట్రీ వేరియంట్ 4జీబీ + 64జీబీ స్టోరేజ్ కాగా, మరొకటి 6జీబీ ర్యామ్ +1 28 జీబీ స్టోరేజ్ వేరియంట్. డిసెంబర్ 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌‌తో ఈ అప్‌డేట్ రానుంది. ఈ కొత్త ఎంఐయూఐ 12 అప్ డేట్ ద్వారా కంట్రోల్ సెంటర్‌కు మెరుగులు దిద్దారు.(చదవండి: రెడ్‌మీ కే40లో పవర్ ఫుల్ ప్రాసెసర్

మరిన్ని వార్తలు