ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి సరికొత్త రెడ్మీ నోట్ 11టీ5జీ లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్ఫోన్ చైనాలో విడుదలైంది. స్టార్డస్ట్ వైట్, అక్వామెరైన్ బ్లూ, మాటే బ్లాక్ కలర్ వేరియంట్స్తో రానుంది. 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999 కాగా, 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉండనుంది. డిసెంబర్ 7 నుంచి కొనుగోలుదారులకు షావోమీ అధికారక వెబ్సైట్తో పాటుగా అమెజాన్లో కూడా అందుబాటులో ఉండనుంది.
రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫీచర్స్