ధమాకా ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్‌ ఇండియా సేల్

12 Aug, 2021 14:43 IST|Sakshi

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న డిజిటల్‌ ఇండియా సేల్‌ను రిలయన్స్‌ ప్రారంభించింది. ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో రిలయన్స్ డిజిటల్‌ ఈ సేల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇందులో 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు రిలయన్స్‌ డిజిటల్‌లో అందుబాటులో ఉంటాయి. దేశంలోని 80 నగరాల్లో ఉన్న 460 స్టోర్లలో ఈ సేల్‌ ప్రారంభం కానుంది. స్టోర్లతో పాటు మై జియోస్టోర్స్‌తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్‌ ఆగస్టు 16 వరకు ఉంటుంది. 

ఆఫర్లు
- ఆగస్టు 16 వరకు జరిగే కొనుగోళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్‌   డిస్కౌంట్‌ని అందిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3,000 వరకు తగ్తింపు పొందవచ్చు
- కనీసం రూ.9999 కొనుగోళ్లపై పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే ఆగస్టు 31 వరకు రూ.500 వ్యాలెట్‌ క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. రూ.10,000 ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్‌మనీ ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ, 10 శాతం క్యాష్ బ్యాక్‌ పొందవచ్చు. క్యాష్‌బ్యాక​ గరిష్ట పరిమితి రూ.5,000లుగా ఉంది.

ఫైనాన్సింగ్‌
సులభమైన ఫైనాన్సింగ్‌, ఈఎంఐ ఆప్షన్స్‌తో డిజిటల్‌ ఇండియా సేల్స్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా మారింది. కొనుగోలు చేసిన భారీ వస్తువులను ఇన్‌స్టా డెలివరి కింద మూడు గంటల్లోనే డెలివరీ చేయనున్నారు. వినియోగదారులు తమ వీలుని బట్టి  సమీపంలోని స్టోర్‌ నుంచి  స్టోర్‌ పికప్ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు.

>
మరిన్ని వార్తలు