రిలయన్స్ మరో డీల్‌

25 Dec, 2020 17:05 IST|Sakshi

ఐఎంజీలో 50శాతం వాటా కొనుగోలు

సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ మరో డీల్‌ కుదుర్చుకున్నారు.  అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సింగపూర్  కుచెందిన  స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్  ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ ఎల్‌ఎల్‌సీలో మేజర్‌ వాటాను కొనుగోలు చేశారు.  రూ .52.08 కోట్లకు  'ఐఎంజీ-ఆర్‌'లో 50శాతం వాటాను సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని ఆర్‌ఐఎల్‌ రెగ్యులేటరీ  ఫైలింగ్‌లో వెల్లడించింది.  ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్‌ పూర్తికాగానే రిలయన్స్‌ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్‌ చేయనుంది.

భారత దేశంలో క్రీడలు,ఫ్యాషన్  వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్‌ చేయడం కోసం 2010లో రిలయన్స్‌-ఐఎంజీ వరల్డ్‌వైడ్‌  సంయుక్తంగా సంస్థను ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కంపెనీ భారత్‌లో పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్‌ చేసింది. 'షేర్ల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, రూ.52.08 కోట్లకు మించకుండా ఐఎంజీ సింగపూర్‌ పీటీఈ వాటాను కొనుగోలు చేస్తామని రిలయన్స్‌ తెలిపింది. ఈ డీల్‌ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్‌ చేస్తామని వెల్లడించింది.  ముందు చేసుకొన్న ఒప్పందం కావడంతో దీనికి ఎటువంటి క్లియరెన్స్‌లు అవసరం లేదని  కూడా రిలయన్స్‌ తెలిపింది. ప్రస్తుతం ఐఎంజీ-ఆర్‌ ఏటా రూ. 25.79 కోట్లు జీఎస్టీతో  సహా రూ.181.70 కోట్ల మేరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వీటిల్లో నికర లాభం రూ.16.35 కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు