మరో కంపెనీలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ భారీగా పెట్టుబడులు..!

1 Mar, 2022 21:07 IST|Sakshi

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌వీఎల్) అబ్రహం & థాకూర్ ఎక్స్ పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సహకారంతో ఈ అబ్రహం అండ్ ఠాకూర్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తోంది. 1992లో డేవిడ్ అబ్రహం రాకేష్ థాకోరే చే ప్రారంభించిన కొద్ది కాలంలోనే కెవిన్ నిగ్లీ ఇందులో చేరారు.

ఆ తర్వాత అతి తక్కువ కాలంలో అబ్రహం & థాకూర్(ఎ అండ్ టి) పాపులర్ బ్రాండ్'గా మారింది. ఈ రంగంలో అబ్రహం & థాకూర్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ రంగంలో భారతీయ వస్త్ర డిజైన్లకు ఆధునికతను జోడించింది. భారతీయ వస్త్రాలకు సంబంధించి A&T డిజైనింగ్ లాంజ్‌వేర్, హోమ్ కలెక్షన్‌లతో ప్రారంభమైంది, వీటిని మొదట లండన్‌లోని ది కాన్రాన్ షాప్‌లో విక్రయించారు. ఫ్యాషన్ సాంస్కృతిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో ముందున్న A&T బ్రాండ్ ఈ రంగంలో బలంగా పాతుకుపోయింది. 

అబ్రహం & ఠాకోర్ ఆసక్తికరమైన మెటీరియల్ ఉపయోగం, సాంప్రదాయ వస్త్ర సాంకేతికతలను తీసుకోవడం కోసం అత్యంత విలక్షణమైన డిజైన్ సంతకాన్ని రూపొందించింది. భారతీయ లగ్జరీ కస్టమర్‌లు తరతరాలుగా వినియోగ మార్పులకు లోనవుతున్నందున, అబ్రహం & ఠాకూర్ టైమ్‌లెస్ డిజైన్‌పై అధిక ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు భారతీయ హస్తకళ ప్రత్యేక వ్యక్తీకరణను తీసుకురావడానికి బ్రాండ్‌తో భాగస్వామ్యం చేయడానికి తాము సంతోషిస్తున్నట్టు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు.

(చదవండి: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..!)

మరిన్ని వార్తలు