ఈ కంపెనీ కార్లపై భారీగా డిస్కౌంట్లు

3 May, 2021 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మీరు తక్కువ ధరలో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, డాట్సన్ తమ కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీవిని జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తయారు చేసింది. ఈ కారు మొత్తం 5 వేరియంట్లను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారులో కంపెనీ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 68 పీఎస్ నుంచి 77 పీఎస్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్, సీవీటి ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి. 

డాట్సన్ తన వినియోగదారులకు రూ.40,000 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద కంపెనీ వినియోగదారులకు రూ.20,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అదే సమయంలో, వినియోగదారులు కూడా రూ.20,000 వారి పాత కారు స్థానంలో కొత్త కారును తీసుకోవడం ద్వారా పొందవచ్చు. మార్కెట్లో డాట్సన్ గో ప్లస్(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ.4.25 లక్షల నుంచి రూ. 6.99 లక్షలుగా ఉంది. అలాగే రెనో ట్రైబర్ - ఈ 7 సీట్ల కారు 4 వేరియంట్లు (RXE, RXL, RXT, RXZ) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను ఉంది. 

ఇది 96 ఎన్ఎమ్ టార్క్, 72 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కారు యొక్క రెండవ వేరియంట్లో కంపెనీ 1.0-లీటర్ సామర్థ్యం గల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 160 ఎన్ఎమ్ టార్క్, 100 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుపై కంపెనీ 45,000 రూపాయల వరకు డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ చౌకైన ఎంపీవీపై రూ.15 వేల వరకు నగదు తగ్గింపు, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర రూ. 5.30 లక్షల నుంచి రూ.7.65 లక్షలుగా ఉంది.

చదవండి:

వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!

మరిన్ని వార్తలు