కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి!

2 Jun, 2022 08:51 IST|Sakshi

 21 పైసలు లాభపడి 77.50 వద్దకు బలోపేతం 

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి 21 పైసలు కోలుకుంది. 77.50 వద్ద ముగిసింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో మంగళవారం జీవితకాల కనిష్టం 77.71కి పడిపోయింది.

 బుధవారం 77.58 వద్ద ప్రారంభమైంది. 77.50–77.62 శ్రేణిలో తిరిగింది. కొన్ని బ్యాంకులు డాలర్ల విక్రయం రూపాయికి కొంత మేర కలిసివచ్చింది. అయితే ఇది తాత్కాలిక ధోరణి అని, రూపాయి బలహీనతే కొనసాగుతుందని నిపుణుల అంచనా. 
 

మరిన్ని వార్తలు