Samsung: ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రి-బుక్‌ చేస్తే స్మార్ట్‌ట్యాగ్‌ ఉచితం...!

6 Aug, 2021 19:44 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ శాంసంగ్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. కొద్ది రోజుల్లోనే శాంసంగ్‌ భారత మార్కెట్‌లోకి నెక్ట్స్‌ జనరేషన్‌ ఫోల్డబుల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేయనుంది. కాగా శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లలోకి ఆగస్టు 11 న లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రీ బుకింగ్‌ను నేటి (ఆగస్టు 6) నుంచి ప్రారంభం​ కానుంది.


ఫ్రీ బుకింగ్‌ కోసం కస్టమర్లు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ ఇండియా ఈ-స్టోర్లలో లేదా శాంసంగ్‌ షాప్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు శాంసంగ్‌ ఉచితంగా శాంసంగ్‌ స్మార్ట్‌ట్యాగ్‌ను అందించనుంది. మార్కెట్‌లో  శాంసంగ్‌ స్మార్ట్‌ట్యాగ్‌ ధర రూ. 2,699 గా ఉంది. రెండువేలతో  ప్రీ బుక్‌ చేసుకున్న అమౌంట్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో అడ్జస్ట్‌ చేయనుంది.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ ధర రూ. 1,49,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ధరలు నిజమైతే మునుపటి శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్లకంటే తక్కువ ధరలు ఉండనున్నాయి. 

మరిన్ని వార్తలు