ఎస్‌బీఐ రూ.746 కోట్ల ఎన్‌పీఏల వేలం

10 Oct, 2022 08:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంతకీ వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) ఎస్‌బీఐ వరుసగా ఈ నెల, వచ్చే నెలలో వేలం వేయనుంది. సింటెక్స్‌ బీఏపీఎల్‌ మోసపూరిత రుణ ఖాతాను కూడా విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ.746 కోట్లను వసూలు చేసుకోనుంది. 

ముందుగా నవంబర్‌ 4న ఎస్‌బీఐ పలు ఎన్‌పీఏ ఖాతాలను వేలం వేయనుంది. సింటెక్స్‌ బీఏపీఎల్‌ రూ.198 కోట్లు, సూరత్‌ హజీరా ఎన్‌హెచ్‌6 టోల్‌వే ప్రైవేటు లిమిటెడ్‌ రూ.335 కోట్లు, శ్రీభావ్‌ పాలీవేవ్స్‌ రూ.20 కోట్ల ఎన్‌పీఏలు వేలం జాబితాలో ఉన్నాయి. సింటెక్స్‌ బీఏపీఎల్‌ ఖాతాకు కేవలం అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలే (ఏఆర్‌సీలు) అర్హులని ఎస్‌బీఐ పేర్కొంది.    
 

మరిన్ని వార్తలు