ఎన్‌ఎస్‌ఈపై సెబీ రూ.6 కోట్ల జరిమానా!

2 Oct, 2020 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే ్చంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ రూ.6 కోట్ల జరిమానా విధించింది. క్యామ్స్‌  కంపెనీతో సహా మొత్తం ఆరు కంపెనీల్లో వాటా  కొనుగోలు చేసినందుకు ఈ జరిమానా విధించింది. సెబీ ఆమోదం పొందకుండానే ఈ కంపెనీల్లో వాటాలను పొందినందుకు ఎన్‌ఎస్‌ఈ ఈ స్థాయిలో జరిమానాను భరించాల్సి వచ్చింది.  క్యామ్స్, పవర్‌ ఎక్సే ్చంజ్‌ ఇండియా లిమిటెడ్,  ఎన్‌ఎస్‌ఈ ఐటీ లిమిటెడ్, ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ–గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్, మార్కెట్‌ సింప్లిఫైడ్‌ ఇండియా లిమిటెడ్, రిసీవబుల్స్‌ ఎక్సే్చంజ్‌ ఆఫ్‌ ఇండియా  కంపెనీల్లో ఎన్‌ఎస్‌ఈ వాటాలను                 కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు