సెన్సెక్స్‌@ 39,000- బ్యాంక్స్‌ దన్ను 

15 Sep, 2020 15:58 IST|Sakshi

288 పాయింట్లు అప్‌- 39,044కు సెన్సెక్స్‌

82 పాయింట్లు ప్లస్‌- 11,522 వద్ద ముగిసిన నిఫ్టీ 

ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా, ఐటీ జూమ్‌- రియల్టీ వీక్‌

బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-1.5 శాతం అప్‌

ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్‌ నెలకొనడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాల వద్దే నిలవగలిగాయి. దీంతో సెన్సెక్స్‌ 39,000 పాయింట్ల మైలురాయికి ఎగువన స్థిరపడగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500ను అధిగమించింది. నేటి ట్రేడింగ్‌లోనూ యథాప్రకారం ఆటుపోట్లు కనిపించినప్పటికీ చివరికి సెన్సెక్స్‌ 288 పాయింట్లు బలపడి 39,044 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు ఎగసి 11,522 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,754 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ ఒక దశలో 11,442 వరకూ నీరసించింది.

మీడియా డౌన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2 శాతం పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం లాభపడింది. రియల్టీ, మీడియా 0.7-0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, సిప్లా, యూపీఎల్‌, యాక్సిస్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్‌ 5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టైటన్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐషర్‌, ఐటీసీ, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.4-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. 

ఆటో గుడ్
డెరివేటివ్‌ కౌంటర్లలో మదర్‌సన్‌, అశోక్‌ లేలాండ్‌, లుపిన్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అరబిందో, నౌకరీ, అంబుజా సిమెంట్‌, ఐజీఎల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, మైండ్‌ట్రీ, అమరరాజా, కమిన్స్‌, గోద్రెజ్‌సీపీ 4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్‌, నాల్కో, ఐబీ హౌసింగ్‌, బీఈఎల్‌, మారికో, పేజ్‌, ఎస్కార్ట్స్‌, అదానీ ఎంటర్‌, పీఎన్‌బీ 3.5-01 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-1.5 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,582 లాభపడగా.. 1,164 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,176  కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, డీఐఐలు రూ. 724 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.    

మరిన్ని వార్తలు