ఫ్లాట్‌గా ప్రారంభం: లాభాల్లోకి జంప్‌

31 May, 2021 09:50 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లోకి జారుకున్నా.. వెంటనే పుంజుకున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నా ఆ తరువాత ఇన్వెస్టర్ల ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా వెంటనే నష్టాల బాటపట్టాయి. ఒక దశలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సె‍క్స్‌ మళ్లీ లాభాల్లోకి మళ్లడం విశేషం. ప్రస్తుతం సెన్సెక్స్‌ 74 పాయింట్లు  ఎగిసి 51497 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 15446 వద్ద కొనసాగుతున్నాయి.  ఐటీసీ, ఐసీఐసీఐ  బ్యాంక్ టాప్ గెయనర్స్‌గానూ, ఎం అండ్ ఎం, సిప్లా  బలహీనంగా కొనసాగుతున్నాయి.  కీలక సూచీలు గత వారమంతా పటిష్టంగా  కొనసాగడంతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు