280 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

23 Mar, 2021 16:42 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను లాభాల్లో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుస నష్టాల నుంచి తేరుకున్న సూచీలు మరింత ఎగిసి ఉత్సాహంగా కొనసాగాయి. కొంచెం సేపు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ తర్వాత తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఉదయం 49,876 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,661 వద్ద కనిష్ఠాన్ని తాకి 50,264 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 280 పాయింట్లు లాభపడి 50,051 వద్ద ముగిసింది. ఇక 14,768 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ట్రేడింగ్ మొత్తం 14,878-14,707 మధ్య కదలాడుతూ చివరకు 78 పాయింట్ల లాభంతో 14,814 వద్ద స్థిరపడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.41 వద్ద నిలిచింది.

చదవండి:

కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు