స్వల్ప లాభాలతో ఫ్లాట్ గా సూచీలు
51800 దిగువన సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 51727 వద్ద నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 15233 కొనసాగుతోన్నాయి. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఐటీ, పీఎస్ఈ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, ఓఎన్జీసీ , పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఐఓసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లాభంతోనూ ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ నష్టంతో ఉన్నాయి.