మార్కెట్లు జంప్‌ : 50వేల ఎగువకు సెన్సెక్స్‌ 

23 Mar, 2021 09:44 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు   లాభాలతో  ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుస నష్టాలనుంచి తేరుకున్న సూచీలు మరింత ఎగిసి ఉత్సాహంగా కొనసాగుతునన్నాయి.సెన్సెక్స్‌ 336 పాయింట్లు ఎగిసి 50వేల105 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు జంప్‌ చేసి  14835 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు  అన్ని రంగాల్లోనూ  కొనుగోళ్లు క నిపిస్తున్నాయి.ముఖ్యంగా  బ్యాంకింగ్‌, ఆటో రంగ లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి.  అమెరికా బాండ్ దిగుబడి పెరగడంతో వాల్ స్ట్రీట్ ర్యాలీ అమింది. ముఖ్యంగా  టెక్నాలజీ స్టాక్స్  బాగా పుంజుకున్నాయి. అదానీ పోర్ట్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్,టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లోనూ, ఐఓసీ, పవర్ గ్రిడ్, బ్రిటానియా,ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్  నష్టాల్లోనూ ట్రేడ్ ‌అవుతున్నాయి.

మరిన్ని వార్తలు