ఆల్టైం గరిష్టానికి సెన్సెక్స్
16వేలకుచేరువలో నిఫ్టీ
బ్యాంక్స్, మెటల్ షేర్ల లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య సెన్సెక్స్ ఆల్టైం గరిష్టాన్ని నమోదు చేసింది. 15,916 వద్ద నిఫ్టీ జీవిత కాల గరిష్టాన్ని తాకింది. శుక్రవారం నాటి లాభాలను కొనసాగిస్తూ పటిష్టంగా కదులుతోంది. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగసిన సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 53048 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 15901 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. ఓఎన్జిసి, గ్రాసిమ్, టాటా స్టీల్, ఆర్ఐఎల్ భారీ లాభాలనార్జిస్తున్నాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటన్, టీసీఎస్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్స్గా ఉన్నాయి.