తీవ్ర ఒడుదుడుకుల్లో  సూచీలు

23 Apr, 2021 13:01 IST|Sakshi

భారీ ఊగిసలాట ధోరణి

సెన్సెక్స్‌ 43పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టం

సాక్షి, ముంబై: ఆరంభంలో  నష్టాల్లో ఉన్న మార్కెట్లు  లాభాల్లోకి మళ్లాయి.   ఆరంభంలో 250 పాయింట్లు  పతనమైన సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా ఎగిసింది. అలాగే నిఫ్టీ 14350 దిగువకు చేరింది. ఆ తరువాత మళ్లీ పుంజుకున్నప్పటిక భారీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.  సెన్సెక్స్‌ 43పాయింట్ల ఫ్టీ మాత్రం  17 పాయింట్లు మైనస్‌లో ఉంది. అయితే  సూచీలకు  మద్దతు   స్థాయిల​  వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఆటో స్టాక్స్ కూడాలాభాల్లో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ స్టాక్స్‌  నష్టపోతున్నాయి. పవర్ గ్రిడ్ టాప్ నిఫ్టీ గెయినర్‌గా  ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , ఎన్‌టిపిసి  లాభపడుతుండగా,  ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుపిఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్  నష్టపోతున్నాయి. 


 

మరిన్ని వార్తలు