మెటల్ మెరుపులు : లాభాల్లో సూచీలు

13 Aug, 2020 09:38 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో  ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు పాజిటివ్ గా ఉన్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 140 పాయింట్ల లాభంతో 38510 వద్ద  నిఫ్టీ 48 పాయింట్లు ఎగిసి 11352 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధానంగా,  బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. హిందాల్కో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు లాభాల్లో ఉన్నాయి.  మరోవైపు భారతి ఎయిర్టెల్, ఐటీసీ, ఎన్ టీపీసీ, హీరో మోటో, మారుతి సుజుకి నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు