స్థిరంగా స్టాక్‌ మార్కెట్‌.. ఫ్లాట్‌గా కొనసాగుతున్న సూచీలు

24 Aug, 2021 10:18 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

ముంబై : స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా మార్కెట్‌ ఆరంభంలో భారీ స్థాయిలో లాభాలు ఉంటుండగా ఈ రోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీకి 56,000 దగ్గర ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 16,700 పాయింట్ల దగ్గర గట్టి నిరోధత ఎదురవుతోంది. గత సెషెన్స్‌లో ఆల్‌టైం హై పాయింట్లను టచ్‌ చేసిస సూచీలు తిరిగి ఆ స్థాయిలను ఇంకా అందుకోలేదు.

ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 55,647 పాయింట్లతో మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి కేవలం 4 పాయింట్లు లాభపడి 55,560 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీలో ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 16,532 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చదవండి : One Plus Buds Pro: స్ట్రెస్‌ను తగ్గించే ఇయర్‌ బడ్స్‌, ధర ఎంతంటే

మరిన్ని వార్తలు