గ్రాము ఎస్‌జీబీ ధర రూ.5,409

19 Dec, 2022 06:23 IST|Sakshi

19న ఇష్యూ ప్రారంభం

23న ముగింపు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్‌జీబీ ధర రూ.5,409 అని ఆర్‌బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్‌జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు.

పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్‌ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.

మరిన్ని వార్తలు