Sovereign Gold : 22 నుంచి ఐదు రోజులు కొత్త గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌

20 Aug, 2022 06:28 IST|Sakshi

గ్రాముకు రూ.5,197గా నిర్ణయం

ముంబై: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2022–23 రెండవ సిరీస్‌ సోమవారం ప్రారంభమవుతోంది. ఐదు రోజుల పాటు (ఆగస్టు 22 నుంచి 26 వరకూ) చందాదారులకు అందుబాటులో ఉండే ఈ స్కీమ్‌ బాండ్‌ ఇష్యూ ధర గ్రా ముకు రూ.5,197 అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్‌బీఐ తెలిపింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్‌తో రూ.5,147కే బాండ్‌ లభిస్తుందని ప్రకటన పేర్కొంది. కేంద్రం తరఫుల ఆర్‌బీఐ చేసే ఈ బాండ్లు స్టాక్‌ ఎక్సే్చంజీలతోపాటు నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా లభ్యమవుతాయి. దేశంలో భౌతిక పసిడికి డిమాండ్‌ తగ్గించి, ఇందుకు సంబంధించిన డబ్బును పొదుపు పథకాల్లోకి మళ్లించడానికి 2015 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు