సీనియర్ సీటిజన్ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సీనియర్ సీటిజన్ ఖాతాదారుల కోసం ప్రత్యేక కొత్త పెన్షన్ సేవలను ప్రవేశపెట్టింది. పెన్షన్ తీసుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్(https://www.pensionseva.sbi) తీసుకొనివచ్చింది. ఈ పోర్టల్ ద్వారా సీనియర్ సీటిజన్ ఖాతాదారులు అన్ని రకాల పెన్షన్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. ముందుగా అవసరమైన సమాచారం అందించి, పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత సేవలు సులభంగా పొందొచ్చని ఎస్బీఐ వివరించింది.(చదవండి: ఈ 4 యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!)
Good news for all Pensioners!
We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease.Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/xioULTSMKC
— State Bank of India (@TheOfficialSBI) September 11, 2021
పోర్టల్ ద్వారా ఏ ఏ సేవలు పొందొచ్చంటే..
ఇక మీ ఫోన్లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించి అలర్ట్లు వస్తాయి. అలాగే లైఫ్ సర్టిఫికేషన్ సదుపాయం మీ దగ్గరల్లో ఉన్న బ్రాంచీవద్ద లభిస్తుంది. మీ ఈ-మెయిల్ కు పెన్షన్ స్లిప్ వస్తుంది. ఇకపోతే మీ పేరు పోర్టల్లో రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు support.pensionseva@sbi.co.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. అలాగే 'ఎస్ఎమ్ఎస్ అన్ హ్యాపీ' టైప్ చేసి 8008202020కు ఎస్ఎమ్ఎస్ చేయవచ్చు లేదా 18004253800/1800112211 లేదా 08026599990 కాల్ చేయవచ్చు.