ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార‍్కెట్లు

30 Jul, 2021 09:37 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నడుమ దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం  స్వల్ప లాభాలతో  ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం సెన్సెక్స్‌ 52,653 పాయింట్లతో క్లోజవగా ఈ రోజు ఉదయం  52,792 పాయింట్లతో  ప్రారంభమయ్యింది.  ఉదయం 9:45 గంటల సమయంలో కేవలం పది పాయింట్ల లాభపడి 52,663 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉదయం 9:45 గంటల సమయానికి ఏడు పాయింట్లు లాభపడి 15,785 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

టెక్‌ మహీంద్రా షేర్లు ఏకంగా 7 శాతం పెరిగాయి. ఈ రోజు మార్కెట్‌లో అధిక లాభాలు అందించిన షేర్‌గా టెక్‌మహీంద్రా నిలిచింది. ఐటీ, ఆటోమొబైల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాల‍్ని చవిచూస్తున్నాయి.     

మరిన్ని వార్తలు