ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తమ జోరును కొనసాగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, ఎఫ్ఎంసిజి, సీమెంట్ షేర్ల అండతో బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 514.33 పాయింట్లు (0.90%) పెరిగి 57852.54 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 157.90 పాయింట్లు (0.92%) లాభపడి 17234.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.05 వద్ద నిలిచింది.
శ్రీ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సీప్లా, టిసీఎస్, హెచ్యుఎల్ షేర్లు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ, దివిస్ ల్యాబ్స్ టాప్ లూజర్లలో ఉన్నాయి. ఆటో, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మినహా అన్ని ఇతర ఐటీ, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో లాభాలతో ముగిశాయి.(చదవండి: భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం!)