Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి

27 Jul, 2021 16:17 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో ఆ తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో వాటి ప్రభావం దేశీయ సూచిలపై పడింది. చివరకు, బీఎస్ఈ సెన్సెక్స్ 273.51 పాయింట్లు (0.52%) క్షీణించి 52578.76 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు (0.49%) నష్టపోయి 15746.50 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.47 వద్ద నిలిచింది. అలాగే, నేటి మార్కెట్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సీప్లా, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్ షేర్లు నష్టపోతే.. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి.
 

మరిన్ని వార్తలు