భారత్‌లో సుజుకీ కటానా

5 Jul, 2022 06:27 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా దేశీయ మార్కెట్లో  కటానా స్పోర్ట్స్‌ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.61 లక్షలు. పూర్తిగా తయారైన బైక్‌ను భారత్‌కు దిగుమతి చేసుకుంటారు.

999సీఎం3 ఫోర్‌ స్ట్రోక్, లిక్విడ్‌ కూల్డ్, డీవోహెచ్‌సీ, ఇన్‌లైన్‌–ఫోర్‌ ఇంజన్, ఫ్లోటింగ్‌ టెయిల్‌ సెక్షన్, మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్, అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ కంట్రోల్స్‌తో కూడిన సుజుకీ ఇంటెలిజెంట్‌ రైడ్‌ సిస్టమ్‌ వంటి హంగులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు