తాజ్‌జీవీకే హోటల్స్‌కు నష్టం

26 Jun, 2021 08:18 IST|Sakshi

హెదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న తాజ్‌జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.4.5 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.5.15 కోట్ల నికరలాభం పొందింది. టర్నోవర్‌ రూ.76 కోట్ల నుంచి రూ.46 కోట్లకు వచ్చి చేరింది. 2020–21లో రూ.97 కోట్ల టర్నోవర్‌పై రూ.39 కోట్ల నష్టం వాటిల్లింది. 

మరిన్ని వార్తలు