తాలిబన్లు ఏమంటారో, ఎగుమతులపై భారత్‌లో ఆందోళనలు

25 Aug, 2021 10:53 IST|Sakshi

హైదరాబాద్‌: తాలిబన్ల చేతిలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌కు భారత్‌ నుంచి ఔషధాల ఎగుమతిపై ఇక్కడి కంపెనీలు ఆందోళనగా ఉన్నాయి. 2021–22లో అఫ్గానిస్తాన్‌కు రూ.935 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. ‘కొత్త తాలిబన్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆందోళన ఉంది.

ఆ దేశానికి  ఎగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలేవీ కేంద్రం జారీ చేయలేదు’ అని ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ భాస్కర్‌ తెలిపారు. 2020–21లో భారత్‌ నుంచి అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.670 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యాయి. 

చదవండి తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు

మరిన్ని వార్తలు