హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ బ్రాండ్ తనిష్క్.. వరలక్ష్మీవ్రత పూజల సందర్భంగా ‘స్వరూపం’ పేరుతో ప్రత్యేక ఆభరణాలను విడుదల చేసింది. బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీల్లో 25 శాతం తగ్గింపునిస్తున్నట్టు ప్రకటించింది. పాత బంగారం ఆభరణాలు ఎటువంటివైనా కానీ మార్చుకుంటే నూరు శాతం విలువను కడుతున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా తనిష్క్ స్టోర్లలో ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఆభరణాల కొనుగోలుపై ఈ ఆఫర్లు అమలవుతాయని పేర్కొంది.