Tech Mahindra: అమెరికన్‌ కంపెనీను కైవసం చేసుకున్న టెక్‌ మహీంద్రా..!

2 Jan, 2022 12:47 IST|Sakshi

అమెరికాకు చెందిన గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, అల్లీస్‌ గ్రూప్‌ ఇండియా సంస్థలను భారత​ ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా పూర్తిగా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

పూర్తివాటాలు టెక్‌ మహీంద్రా సొంతం..! 
అల్లీస్‌ ఇండియా, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పూర్తిగా 100 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు టెక్‌ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్‌ మొత్తం విలువ 125 మిలియన్ డాలర్లు.  ఈ మొత్తాన్ని కంపెనీ పూర్తిగా నగదు రూపంలోనే చెల్లించనుంది.

అమెరికాలోని సీటెల్‌​ వేదికగా అల్లీస్‌ ఇండియా, గ్రీన్‌ ఇన్వెస్టమెంట్స్‌ పనిచేస్తున్నాయి. సుమారు 660 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.   ఈ సంస్థల ఆదాయం 39.6 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ సంస్థల కొనుగోలుతో టెఖ​ మహీంద్రాకు డిజిటల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సోల్యుషన్స్‌, లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, క్లౌడ్‌ అండ్‌ ఆటోమేషన్‌, బీఐ అండ్‌ అనలిటిక్స్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌ వంటి రంగాల్లో కంపెనీ మరింత వృద్ధిని నమోదుచేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. 

చదవండి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంచలన నిర్ణయం..! వాటిని వదిలించుకునేందుకే..

మరిన్ని వార్తలు