టెక్‌ మహీంద్రా నుంచి క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌ ప్లాట్‌ఫాం

13 Dec, 2022 13:11 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తాజాగా క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. కంపెనీలు వేగవంతంగా డిజిటల్‌ వైపు మళ్లేందుకు ఇది సహాయకరంగా ఉండగలదని సంస్థ చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌ సుధీర్‌ నాయర్‌ తెలిపారు. ఈ ప్లాట్‌ఫాంతో 25-30 శాతం మేర వ్యయాలు ఆదా కాగలవని, క్లౌడ్‌కు మైగ్రేట్‌ అయ్యేందుకు పట్టే సమయం కూడా 30 శాతం తగ్గుతుందని వివరించారు. టెలికం, ఆటోమొబైల్‌ తదితర రంగాలకు అవసరమైన క్లౌడ్‌ ఆధారిత సొల్యూషన్స్‌ను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు