రూ. 500 కోట్లతో పోకర్ణ ప్లాంటు

31 Jul, 2021 00:21 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్వాంట్రా క్వార్జ్‌ బ్రాండ్‌ పేరుతో ప్రీమియం క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ హైదరాబాద్‌ సమీపంలో నూతన ప్లాంటును నెలకొల్పింది. ఇటలీకి చెందిన పేటెంటెడ్‌ బ్రెటన్‌స్టోన్‌ టెక్నాలజీతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని జూలై 31న (నేడు) ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది మార్చిలో ప్లాంటులో ఉత్పత్తి మొదలైందని పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్‌ శుక్రవారం తెలిపారు.  

మరిన్ని వార్తలు