యానివర్సరీ సేల్‌, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు

19 Apr, 2023 17:43 IST|Sakshi

సాక్షి, ముంబై: ఐక్యూ మొబైల్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ఐక్యూ  బ్రాండ్‌  స్పెషల్‌ సేల్‌ ప్రకటించింది. ఈ రోజునుంచి (ఏప్రిల్‌ 19, బుధవారం) ఏప్రిల్ 24 వరకు ఈ సేల్‌ కొనసాగుతుంది. ఫ్లాగ్‌షిప్, నియో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై  ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. 

కంపెనీ తాజా గేమింగ్-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌  ఐక్యూ 11 5జీతోపాటు, ఐక్యూ 9,  ఐక్యూ 9 ప్రో మోడల్స్‌ కొనుగోళ్లపై డిస్కౌంట్‌ లభ్యం. దీంతోపాటు  ఆఫర్‌లు బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉన్నాయని, అయితే హైస్టోరేజ్‌ వేరియంట్‌కు ఈ తగ్గింపు వర్తించదని  కంపెనీ వెల్లడించింది.
 
కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఇండియాలో ఐక్యూ 11 5జీ  బేస్‌ మోడల్‌ ఇపుడు  రూ. 49,999కే  లభ్యం.  లిస్టెడ్ ధర రూ. 59,999.
(ఇదీ చదవండి: ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్‌?)

ఈ సేల్‌లో ఐక్యూ 9,  ఐక్యూ 9ప్రో  ప్రస్తుత ధర రూ. 30,990, రూ. 39,990. అమెజాన్ ఇండియాలో  వీటి ధర ప్రస్తుతం రూ. 35,990, రూ. 44,990 గా ఉంది. దీంతోపాటు ఐక్యూ Neo 6 5జీ  స్మార్ట్‌ఫోన్‌ను 5,000 తగ్గింపు తరువాత రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. (అదరగొట్టిన టీసీఎస్‌: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్‌ చిట్కాలివిగో!)

ఐక్యూ 11 5జీ స్పెసిఫికేషన్స్‌ 
6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్‌ప్లే
Android 13-ఆధారిత Funtouch OS 13
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌​  8 Gen 2 SoC
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కేవలం 8 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుంది. కాగా చైనీస్ టెక్ దిగ్గజం వివో మద్దతుతో,  2020లో భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ.  

మరిన్ని వార్తలు