Petrol, diesel price: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

6 Oct, 2021 10:12 IST|Sakshi

దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతుంది. బుధవారం దేశ వ్యాప్తంగా లీటర్​ పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెరిగాయి. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.15 పెంచడం సామాన్యులకు మోయలేని పెనుభారంగా మారింది. 

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.107.08 ఉండగా డీజిల్​ ధర రూ.99.75గా ఉంది. 

వైజాగ్​లో పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా లీటర్​ డీజిల్​ ధర రూ.100.1 ఉంది. 

ముంబైలో పెట్రోల్​ ధర రూ. 108.93 ఉండగా లీటర్​ డీజిల్​ ధర రూ.99.14 ఉంది. 

కోల్​కతాలో పెట్రోల్​ ధర రూ.103.61 ఉండగా లీటర్​ డీజిల్​ ధర రూ.94.49 ఉంది. 

చెన్నైలో పెట్రోల్ ధర​ రూ.100.46 ఉండగా లీటర్​ డీజిల్​ రూ.95.90 ఉంది. 
 

మరిన్ని వార్తలు