రెండోరోజు అదే జోరు.. లాభాల్లో మార్కెట్‌

10 Aug, 2021 09:50 IST|Sakshi

ముంబై: ఐటీ, బ్యాంకు షేర్లు లాభాలు అందిస్తుండటంతో స్టాక్ మార్కెట్‌ జోరు తగ్గడం లేదు. మంగళవారం కూడా మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభమైంది మొదలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరుగుతూ పోయాయి.

ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 54,461 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లూ పుంజుకుంటూ పైపైకి పోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో 214 పాయింట్లు లాభపడి 54,617 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 16,274 పాయింట్ల వద్ద మొదలై 60 పాయింట్లు లాభపడి 16,317 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు