ఆర్థిక అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల్లో తలెత్తిన ఇబ్బందులు భారత్తో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.19 గంటల సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 59277 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ సైతం 104 పాయింట్ల నష్టంతో 17644 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది.
దివిస్ ల్యాబ్, సన్ ఫార్మా,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఫోర్ట్స్, నెస్లే, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ,ఎథీర్ మోటార్స్, మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.