Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

13 May, 2022 17:48 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మదుపర్లు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సాయంత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్‌ 136పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ సైతం 25పాయింట్ల స్వల్ప నష్టాలతో ముగిసింది. 

ఇక టాటామోటార్స్‌,సన్‌ ఫార్మా, ఎం అండ్‌ ఎం, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, యూపీఎల్‌, టైటాన్‌ కంపెనీ, ఎథేర్‌ మోటార్స్‌ లాభాల్ని గడించగా..హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. 
 

మరిన్ని వార్తలు