Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా నష్టాల బాటలోనే పయనిస్తూ ఉన్నాయి. అయితే నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 17.42 పాయింట్ల లాభంతో 66247.66 వద్ద.. నిఫ్టీ 7.25 పాయింట్ల లాభంతో 19749.55 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
నేడు లాభాలు పొందిన కంపెనీల జాబితాలో ప్రధానంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఆదానీ పోర్ట్స్ చేరాయి. నష్టాలను చవి చూసిన కంపెనీలుగా విప్రో, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, LTIMindtree వంటివి ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)