తోషిబా ట్రాన్స్‌మిషన్‌కు ఏపీ ప్రాజెక్టుల్లో ఆర్డర్లు 

23 Mar, 2023 20:56 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తోషిబా ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్స్‌ సిస్టమ్స్‌ (టీటీడీఐ)కు 32 యూనిట్ల అవుట్‌డోర్‌ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌గేర్‌ (జీఐఎస్‌)కి సంబంధించి ఆర్డర్లు లభించాయి. వీటిలో 23 యూనిట్లు 400కేవీవి, 9 యూనిట్లు 220కేవీవి ఉన్నట్లు సంస్థ వివరించింది.

 చదవండి: హిండెన్‌బర్గ్‌ లేటెస్ట్‌ రిపోర్ట్‌: భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ అమృత ఆహూజా పాత్ర ఏంటి?

వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని ఆలమూరు, కొడమూరులో సౌర, పవన పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన పూలింగ్‌ సబ్‌స్ట్రేషన్‌లతో పాటు గోవాలోని జెల్డెమ్‌ సబ్‌స్టేషన్‌ కోసం రూపొందించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా తెలిపారు. ఈ జీఐఎస్‌ యూనిట్లను హైదరాబాద్‌కు దగ్గర్లోని తమ ప్లాంటులో తయారు చేయనున్నట్లు, ఈ ఏడాది మే నుంచి సైట్‌ లొకేషన్లకు డెలివరీలు అందించనున్నట్లు ఆయన చెప్పారు.  

ట్విటర్‌ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు

Hindenburg's report: చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్‌’ బాగోతం ఇదే.

మరిన్ని వార్తలు