హైదరాబాద్‌ టూ రాజమండ్రి.. ఫ్లైట్‌ సర్వీసులు ప్రారంభించనున్న సంస్థ

22 Feb, 2022 08:35 IST|Sakshi

2022 ఫిబ్రవరి 23 నుంచి ట్రూ జెట్‌ సర్వీసులు ప్రారంభం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్‌ తన సేవలను ఫిబ్రవరి 23 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. వివిధ పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 5 నుండి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్‌–విద్యానగర్‌–హైదరాబాద్, విద్యానగర్‌–బెంగళూరు–విద్యానగర్, బెంగళూరు–బీదర్‌–బెంగళూరు, హైదరాబాద్‌–రాజమండ్రి–హైదరాబాద్, హైదరాబాద్‌–నాందేడ్‌–హైదరాబాద్, ముంబై–నాందేడ్‌–ముంబై, ముంబై–కొల్హాపూర్‌–ముంబై, ముంబై–జల్గావ్‌–ముంబై రూట్లలో సర్వీసులు ఉంటాయని ట్రూజెట్‌ ఎండీ వి.ఉమేశ్‌ సోమవారం వెల్లడించారు.   
 

మరిన్ని వార్తలు