భారతీయ విద్యార్ధులకు అమెరికన్‌ ఎంబసీ గుడ్‌ న్యూస్‌!

26 Jun, 2022 16:49 IST|Sakshi

భారతీయ విద్యార్థులకు భారత్‌లోని అమెరికన్‌ ఎంబసీ కార్యాలయం శుభవార్త చెప్పింది. చట్టబద్దంగా అమెరికాలో చదువుకునేందుకు అర్హులైన విద్యార్ధులు పొందే ఐ-20 పత్రాలు ఉండి, ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్‌ స్లాట్లు బుక్​ చేసుకోవాలని ప్రకటించింది.

అమెరికాలో చదువుకునేందుకు వేలాది మంది విద్యార్ధులకు యునైటెడ్ స్టేట్స్‌లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సెర్టిఫైడ్‌ స్కూల్‌(ఎస్‌ఈవీఐసీ)లో అడ్మిషన్‌ లభిస్తుంది. దీని తర్వాత సంబంధిత స్కూల్‌ నుంచి అర్హులైన విద్యార్ధులకు అధికారులు ఫారమ్ ఐ-20ని పంపుతారు.

అయితే విద్యార్ధులందరూ పైన పేర్కొన్న ఐ-20 ఫారమ్‌ను అమెరికన్‌ యూనివర్సిటీస్‌ నుంచి పొందారు. యూనివర్సిటీతో పాటు అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకోసం భారత్‌లో ఉన్న యూఎస్‌ ఎంబసీ విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

కానీ ఆ ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. అందుకే భారత విదేశాంగ శాఖ యూఎస్‌తో చర్చలు జరిపి..భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయాలని కోరింది. భారత్‌ కోరిక మేరకు 2022 జూన్​- జులై కావాల్సిన ఇంటర్వ్యూ స్లాట్లను మే నెలలో ఓపెన్​ చేసింది. తాజాగా..మరో సారి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. 

ఇందులో భాగంగా..త్వరలో యూఎస్‌ ఎంబసీ, కాన్సలేట్‌ కార్యాలయాల్లో విద్యార్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఐ-20 డాక్యుమెంట్లు ఉంటే ఆలస్యం చేయకుండా మేం నిర్వహించే ఇంటర్వ్యూల కోసం స్లాట్‌లు బుక్‌ చేసుకోండి. విద్యార్ధులు పొందాల్సిన ఎఫ్​, ఎం, జే వీసాల కోసం ఆగస్టు14 తర్వాత ఇంటర్వ్యూలు జరగుతాయి," అని ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ట్వీట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు