Vedanta దూకుడు: గుజరాత్‌లో సెమీకండక్టర్‌ ప్లాంటు

13 Sep, 2022 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్‌ ప్లాంటును గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని పారిశ్రామిక దిగ్గజం వేదాంత నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో తలపెడుతున్న ఈ ప్రాజెక్టులో డిస్‌ప్లే, సెమీకండక్టర్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  అయితే దీనిపై వేదాంత ప్రతినిధులు కానీ,  ఫాక్స్‌కాన్ వెంటనే స్పందించ లేదు.

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కలిసి 20 బిలియన్‌ డాలర్ల జాయింట్‌ వెంచర్‌గా వేదాంత తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు కోసం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక కూడా పోటీపడ్డాయి. కానీ ఇటీవల ముగిసిన తుది చర్చల్లో మహారాష్ట్రను పక్కకు నెట్టి గుజరాత్‌ ఆ ప్రాజెక్టును దక్కించుకుంది.   కాగా భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో  15 బిలియన్‌ డాలర్లనుంచి  2026 నాటికి  63 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు