ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్

29 Apr, 2021 20:36 IST|Sakshi

వివో తన వి-సిరీస్‌లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 
  
వివో వీ21 5జీ ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం
  • 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే 
  • మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ 
  • 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 
  • ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 
  • 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 
  • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ 
  • 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 
  • 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 
  • 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990

చదవండి:

2021లో భారీగా పెరిగిన ఫేస్‌బుక్‌ ఆదాయం 

మరిన్ని వార్తలు