Volkswagen: కార్ల ధరలు పెరిగాయ్‌

1 Sep, 2021 07:41 IST|Sakshi

ముంబై: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ సెప్టెంబర్‌ 1 నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్‌ పోలో, మిడ్‌ సైజ్‌ సెడాన్‌ వెంటో ఉన్నాయి. 3 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. 

తయారీ వ్యయం అధికం అవుతున్నందునే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. పోలో జీటీ మినహాయిస్తున్నట్టు వివరించింది. ఆగస్ట్‌ 31 నాటికి కార్లను బుక్‌ చేసుకున్న వినియోగదార్లపై ఎటువంటి ధరల భారం ఉండబోదని స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు