Xiaomi: బ్లాక్‌ ఫ్రైడే సేల్‌: షావోమీ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!

27 Nov, 2021 18:43 IST|Sakshi

Xiaomi Black Friday Sale Starts Goes On Till November 30: అమెరికాలో థ్యాంక్స్‌గీవింగ్‌తో  సాగే భారీ డిస్కౌంట్ల బ్లాక్‌ ఫ్రైడ్‌ సేల్‌ ఇప్పుడు భారత్‌లోని పలు కంపెనీలు  మొదలుపెట్టాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ కూడా చేరింది. షావోమీ బ్లాక్‌ ఫ్రైడ్‌సేల్‌ను ప్రకటించగా, ఈ సేల్‌ నవంబర్‌ 23 నుంచి ప్రారంభమవ్వగా నవంబర్‌ 30తో ముగియనుంది. బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా టీవీలు, ల్యాప్‌టాప్స్‌, ఆడియో, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులపై భారీ తగ్గింపును షావోమీ ప్రకటించింది.
చదవండి: ఇండియా కుబేరుడు.. 2 సార్లు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు

కొనుగోలుదారులకు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటుగా..పలు ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై అదనంగా 10 శాతం తగ్గింపు రానుంది. అంతేకాకండా పలు షావోమీ ఉత్పత్తుల కొనుగోలుపై 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా షావోమీ అందించనుంది. 

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా పలు ఉత్పతులపై షోవోమీ అందిస్తోన్న ఆఫర్లు

ఎమ్‌ఐ 11ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 4 వేల తగ్గింపు. 

రెడ్‌మీ బుక్‌ 15 ల్యాప్‌టాప్‌ కొనుగోలుదారులకు రూ. 35,499కే లభించనుంది.

ఎమ్‌ఐ టీవీ 4సీ 43ఇంచ్‌, ఎమ్‌ఐ టీవీ 4ఏ 43ఇంచ్‌ హరిజోన్‌ ఎడిషన్‌, రెడ్‌మీ స్మార్ట్‌టీవీ 43 ఇంచ్‌ స్మార్ట్‌టీవీల కొనుగోలుపై రూ. 2000 వరకు డిస్కౌంట్‌.

ఎమ్‌ఐ స్మార్ట్‌బ్యాండ్‌ 5 కొనుగోలుదారులకు రూ. 2270కు లభించనుంది. 

ఎమ్‌ఐ వాచ్‌ రివాల్వ్‌ క్రోమ్‌, ఎయిర్‌ పూరిఫైయర్‌ 3 ఉత్పత్తులపై 2 వేల తగ్గింపు.మరిన్ని ఆఫర్లను షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చును. 
చదవండి: స్మార్ట్‌ఫోన్లకు ఎండ్‌కార్డ్‌...! వాటి స్థానంలో పవర్‌ఫుల్‌..!

మరిన్ని వార్తలు