Xiaomi: షావోమికి కాసుల వర్షం కురిపిస్తోన్న భారతీయులు...!

7 Oct, 2021 21:24 IST|Sakshi

దసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్‌ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్‌ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ-కామర్స్‌ సంస్థల బాటలోనే ప్రముఖ చైనీస్‌ దిగ్గజం షావోమీ కూడా నడుస్తోంది. షావోమీ కొనుగోలు దారులకు ‘దీపావళి సేల్‌ విత్‌ ఎమ్‌ఐ’ సేల్‌ ను ప్రకటించింది. అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌తో పాటుగా షావోమీ సేల్‌పై భారతీయులు ఎగబడి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేశారు. 5 రోజుల్లో అక్షరాల 20 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని షావోమీ బుధవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది.
చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్‌ డాలర్లు వారి సొంతం..!

ప్రీమియం సెగ్మెంట్‌లో భాగంగా షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ5జీ, మిడియమ్‌ సెగ్మెంట్‌లో ఎమ్‌ 11ఎక్స్‌, రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌, రెడ్‌మీ నోట్‌ 10 ప్రో, రెడ్‌మీ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో 10 శాతం మేర అమ్మకాలు జరిగాయని షావోమీ పేర్కొంది. ఇక స్మార్ట్‌టీవీ అమ్మకాల్లో కూడా షావోమీ రికార్డు నమోదు చేసింది. మూడురోజల్లో​ సుమారు లక్షకు పైగా స్మార్ట్‌టీవీలను షావోమీ విక్రయించింది. 
చదవండి: ఎలన్‌ మస్క్‌ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్‌!

>
మరిన్ని వార్తలు