Xiaomi Redmi 11 5G: తక్కువ ధరకే, అదిరిపోయే రెడ్‌ మీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌!

29 May, 2022 18:29 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ షావోమీ సబ్‌ బ్రాండ​ రెడ్‌మీ తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్‌మీ 11 5జీతో రానున్న ఈ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో జూన్‌ నెలలో విడుదల కానుండగా..ఈ ఫోన్‌ ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్,   మెయిన్‌ కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంటుందని తెలుస్తోంది.  ఈ ఫోన్‌ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండగా 50 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్‌మీ డిజైన్‌ చేసింది

 భారత్‌ మార్కెట్‌లో జూన్ నెలలో విడుదల కానున్న ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే  4జీబీ ర్యామ్ ప్లస్‌ 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధరగా ఉండనుంది. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్‌ గురించి మరిన్ని విషయాల్ని వెలడించనుంది. టీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు