బీ న్యూలో రెడ్‌మీ నోట్‌ 12 5జీ సిరీస్‌ ఆవిష్కరణ

12 Jan, 2023 08:02 IST|Sakshi

హైదరాబాద్‌: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ స్టోర్లలో రెడ్‌మీ నోట్‌ 12 5జీ సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఇక్కడ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటి ఈషా రెబ్బ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు.

సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి నితేష్, రెడ్‌మీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్‌ కొనుగోళ్లకు సంబంధించి ఈఎంఐ, జీరో ఫైనాన్స్‌ సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!

మరిన్ని వార్తలు