జేజీ కెమికల్స్‌ ఐపీవో బాట

7 Jan, 2023 14:37 IST|Sakshi

న్యూఢిల్లీ: జింక్‌ ఆక్సైడ్‌ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.

ఐపీవోలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 57 లక్షల షేర్లను ప్రస్తుత ప్రమోటర్‌ గ్రూప్‌ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా విజన్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఫిన్‌వెస్ట్‌ 36.4 లక్షల షేర్లను ఆఫర్‌ చేయనుంది.

చదవండి: Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం

>
మరిన్ని వార్తలు